సత్యసాయి: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురువారం కనగానపల్లి మండలంలో పర్యటించి పలు మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనారోగ్యంతో మరణించిన కనగానపల్లికి చెందిన తలారి ఓబులపతి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం కొండ్రెడ్డి బావి గ్రామానికి చేరుకుని మృతి చెందిన మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.