ASR: పాడేరు నూతనంగా ఐటీడీఏ పీవోగా ఆదిత్య వర్మ ఇవాళ ఉదయం పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ముందుగా తన సతీమణి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపూజతో కలిసి ఆయన మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాధ్యతలను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు.