SKLM: తిరుమల పవిత్రతను కాపాడే దిశగా TTD ఛైర్మన్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైసీపీ ఆమదాలవలస సమన్వయకర్త రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. BR నాయుడు TTDను అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఇవాళ YCP శ్రేణులు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయాలన్నారు.