AKP: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోటవురట్ల మండలంలో మూడు పంచాయతీలకు పుష్ కార్ట్స్తో పాటు తడి, పొడి, ప్రమాదకరమైన చెత్త సేకరణకు డస్ట్ బిన్లను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని కోటవురట్ల తంగేడు, టి. జగ్గంపేట పంచాయతీలకు కేటాయిస్తున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. వీటి ద్వారా చెత్త సేకరణ చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.