SKLM: ద్విచక్రవాహనాలు, బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న ఒడిశాకు చెందిన దొంగను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ డి. లక్ష్మణరావు మీడియా సమావేశం నిర్వహించారు. టెక్కలి జగతి మెట్ట కూడలిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడి నట్లు చెప్పారు. నిందితుడి నుంచి 10 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.