సత్యసాయి: మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఘన నివాళులర్పించారు. కూటమి నాయకులతో కలిసి శనివారం ఉదయం పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సామాజిక విప్లవ యోధుడుగా అంటరానితనం, సామాజిక రుగ్మతలపై పూలే చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.