ప్రకాశం: గ్రామీణ సంపద పెంపుదలకు పెయ్యదూడల ఉత్పత్తి పథకం ఎంతో మేలని ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. మర్రిపూడిలో డాక్టర్ మని శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన 56వ ప్రదర్శన సభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం దూడల కోసం ప్రత్యేక టీకాను కేవలం రూ. 150కే అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.