తిరుపతి కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినతుల స్వీకరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు, డీఆర్వో నరసింహులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు వినడంతో పాటు పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.