అన్నమయ్య: టీడీపీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి- మదనపల్లి రింగ్ రోడ్డుపై 90 వాట్స్ లైట్లు ఏర్పాటు చేశారు. తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, ఇంజినీర్ కిరీటి ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడమె తమ బాధ్యత అని కమిషనర్ తెలిపారు.