GNTR: భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని 8వ డివిజన్ క్రిస్టియన్ పేట పార్క్ రోడ్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం, చిత్రపటానికి వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.