W.G: నరసాపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ. షరీఫ్కు పార్టీ అధిష్టానం గుర్తింపునిచ్చింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన ‘పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయనను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న షరీఫ్, గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా, క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్గా విశేష సేవలు అందించారు.