E.G: పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోలీస్ అవుట్ పోస్ట్ నూతన భవనం నిర్మాణం చేస్తున్నామని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం కొంతమూరులో కేటాయించిన స్థలంలో పోలీస్ అవుట్ పోస్ట్ నూతన భవనం నిర్మాణానికి MLA శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ.50 వేలు అందిస్తానని తెలిపారు.