నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రూ.2.30 కోట్లతో ముఖ ద్వారాలు నిర్మించారు. వీటిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వర్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ కలిసి ఇవాళ ప్రారంభించారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తన హయాంలోనే దర్గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు.