కోనసీమ: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు ముమ్మిడివరం MLA దాట్ల సుబ్బరాజు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్లతో కూడిన ప్రత్యేక పెయింటింగ్ను MLA కుటుంబ సభ్యులు మంత్రికి అందజేశారు. లోకేశ్ అందరినీ పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు.