CTR: పెనుమూరు మండలం సాతంబాకం బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడు గుడియాత్తం తాలూకా పార్వతీపురానికి చెందిన కుమార్(47) ఆదివారం బంధువుల వద్దకు వచ్చాడు. కుటుంబ సమస్యల కారణంగా బాధలో అతిగా మద్యం సేవించి, ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు తెలిపారు.