ప్రకాశం: పామూరు పట్టణంలో కొత్త విద్యుత్ లైన్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నాయబ్ రసూల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పామూరులోని పాత స్టేట్ బ్యాంకు రోడ్డు, కరెంట్ ఆఫీస్ కాలనీ, ఇరువురు రోడ్డు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.