KRNL: ఎమ్మిగనూరు ఆటోలు లైన్లో పెట్టుకునే విషయంలో హనుమాపురానికి చెందిన నవీన్, రామాంజి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవ గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణగా మారి పరస్పరం దాడులు, ఆటోల అద్దాల ధ్వంసానికి దారితీసింది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు 14 మందిపై కేసునమోదు చేసినట్లు SI నిరంజన్ రెడ్డి తెలిపారు.