పల్నాడు జిల్లా నరసరావుపేటలో జీఎస్టీ చట్టం అమలుపై అధికారులతో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా ప్రతి దుకాణాలకు జీఎస్టీ అవగాహన కల్పించిన బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ వసూళ్లు పెంచడంలో శాఖల సమన్వయం కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు.