ELR: పీఆర్ 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. శనివారం భీమడోలు మండలం గుండుగొలను కొనుగోలు కేంద్రం వద్ద ఎమ్మెల్యే ధర్మరాజును రైతుసంఘం నాయకులు కలిసి సమస్యలు వివరించారు. పీఆర్ 126 రకం అధిక దిగుబడులు ఇస్తుందని, రైతులు సాగు చేస్తున్నప్పటికీ కొనుగోలు నిలిపివేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.