ASR: అమరావతిలో GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిను కలిసి సంస్థలో సిబ్బంది కొరత, పరిపాలనా సమస్యలపై ఇవాళ వినతిపత్రం సమర్పించారు. మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, ఇంజినీరింగ్, ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. గిరిజన రైతుల నుంచి కాఫీ కొనుగోలుకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు.