E.G: రాజమండ్రి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి చేరుకుని గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఘన స్వాగతం పలికారు. ఆయనని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించే స్నాతకోత్సవం, పలు కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొనున్నారు.