E.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని విస్మరించాయని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కామన ప్రభాకరరావు అన్నారు. అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకురు గ్రామంలో ఆదర్శ రైతు ప్రతినిధులను సత్కరించారు. 1929వ సంవత్సరంలోనే బీహార్ రాష్ట్రంలో సహజానంద సరస్వతి రైతు ఉద్యమం ప్రారంభించారన్నారు.