PPM: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్వతీపురంలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, న్యాయవేత్తగా విశిష్ట స్థానాన్ని సంపాదించారని తెలిపారు.