ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ సిబ్బంది సంక్షేమ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది వద్ద ఎస్పీ ప్రతాప్ కిషోర్ వినతులను స్వీకరించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.