SRPT: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు జ్యోతుల రామకృష్ణ (54) మృతి చెందిన ఘటన నెలకొంది. సీఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సూర్యాపేట నుంచి బొప్పారం వెళ్తుండగా అచ్యుత తండా సమీపంలో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రామకృష్ణ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.