BDK: భద్రాచలం ఐటీసీ కార్మికుల రిలే నిరాహార దీక్ష నేటితో ఏడవ రోజుకు చేరుకుంది. బుధవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల వీరనారాయణ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వీరనారాయణ మాట్లాడుతూ.. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికులకు పార్టీ ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.