JGL:పేదల వైద్య చికిత్సకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని 32వ వార్డుకు చెందిన కోనపురం సత్తమ్మ అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపద్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2.50 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి కుటుంబ సభ్యులకు అందజేశారు. అవసరమైన వారికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఆయన తెలిపారు.