KDP: తొండూరు మండలం మల్లేలలో మంగళవారం రాత్రి తల్లీకూతురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన షేక్ బీబీ(58), షేక్ ఇమాంబి(35) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకునట్లు స్థానికులు తెలిపారు. షేక్ బీబీ భర్త షేక్ ఇమామ్ బాషా ఇంట్లో కనిపించడం లేదని, అప్పుల బాధతో కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.