ASR: విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రమశిక్షణతో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని బ్రహ్మ కుమారీస్ ప్రతినిధులు అన్నారు. సోమవారం అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన నషాముక్తా అభియాన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి విలువలతో కూడిన విద్య, మంచి ఆలోచన పనులు, ప్రవర్తనకు ధ్యానం ఉపయోగకరమని ప్రిన్సిపాల్ డా. నాయక్ అన్నారు.