KDP: పులివెందులలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్పై ఏసీబీ దాడి నిర్వహించింది. లంచం తీసుకుంటున్న సమయంలో రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్సై అనిల్ కుమార్లను అధికారులు పట్టుకున్నారు. లంచం సొమ్మును సీజ్ చేసి, కేసుపై విచారణ కొనసాగుతోంది.చైన్ స్నాచింగ్ కేసు దర్యాప్తులో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు.