NZB: సిరికొండ మండలంలోని హొన్నాజి పేట్ గ్రామంలో మంగళవారం పీఏసీఎస్లో మహాజన సభ నిర్వహించారు. సీఈవో గజ్జల నర్సయ్య జమ ఖర్చులు చదివి వినిపించారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తామని పీఏసీఎస్ ఇన్ఛార్జి అధికారి దేవకళ అన్నారు. కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతామని అన్నారు.