కృష్ణా: ప్రస్తుత సర్పంచుల పదవీకాలం రాబోయే ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్న నేపథ్యంలోగుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు సోమవారం సన్మాన కార్యక్రమం జరిగింది. మండలంలోని సర్పంచులను ఎంపీడీవో ఇమ్రాన్ పూలమాలలతో సత్కరించి, శాలువాలు కప్పి, మెమెంటోలు అందజేశారు. సర్పంచులు తమ పదవీకాలంలో గ్రామాభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.