SRD: సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో గల ఓ ప్రైవేట్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. విద్యుత్ ఘాతానికి గురై ఇసాముద్దీన్ (30) అనే యువకుడి కాళ్లు, చేతులు, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది రఘురామ్, శరీఫ్ వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.