SRPT: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతుల కల్పనకు మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి శ్రీకారం చుట్టారు. సోమవారం ఆయన నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ కు వచ్చే మహిళ రైతులకు ఇబ్బందులు కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.