MDK: అల్లాదుర్గం మండలంలోని గొల్లకుంటతండా గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా మారింది. రోడ్డుకు ఆనుకొని క్రీడా ప్రాంగణం అనే పేరు గల బోర్డును తగిలించారు. ఓ వ్యవసాయ చేనులో ఏర్పాటు చేయడంతో ఆ రైతు చేను దున్నుకోవడం వల్ల యువకులు క్రీడలకు దూరమవుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాన్ని వినియోగంలోకి తీసుకురావలన్నారు.