PLD: మాచర్ల – విజయవాడ ప్యాసింజర్ రైలు కింద పడి వీరిశెట్టి వైష్ణవి (29) అనే మహిళ మృతి చెందారు. సోమవారం గురజాల రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.