KRNL: ఆదోనిలోని జంకన్వాడీ కాలనీకి చెందిన అమిన్ అస్వో (39) క్యాన్సర్, అల్సర్ వంటి అనారోగ్యాలతో మనస్తాపానికి గురై ఈనెల 7న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి కర్నూలుకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.