NDL: బనగానపల్లె నియోజకవర్గం అవుకుమెట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం నిర్ణయించిన భూములను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. భూమి చదును, జంగిల్ క్లియరెన్స్ పనులను పర్యవేక్షించిన ఆయన, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా చదును చేయాలని ఆదేశించారు.