TPT: తిరుపతిలో ఆదివారం గంజాయి పట్టుబడింది. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతికి చెందిన ఉమాపతి, ధనలక్ష్మి దంపతులు దామినేడుకు వెళ్లారు. అక్కడ జోసెఫ్ వద్ద గంజాయి తీసుకుని, బైకుపై తిరుపతికి తెస్తుండగా లక్ష్మీపురం సర్కిల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10కేజీల గంజాయి, బైక్, రూ.22,900, ఫోన్లు, బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు.