KDP: ప్రొద్దుటూరు లింగాపురంలో సహజీవనం సాగిస్తున్న రామాంజనేయులు, ప్రమీల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమీల మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు భర్త ఐజాక్, ఇటు బంధువులు రాలేదు. పోలీసులు సమాచారమిచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో ఆమె మృతదేహం ప్రొద్దుటూరు ఆసుపత్రి మార్చురీలోనే ఉంచారు. మున్సిపాలిటీ, స్వచ్ఛంద సంస్థల దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.