SRCL: జిల్లాలో పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సూచించారు. చందుర్తి మండల కేంద్రం నుండి మోత్కరాపేట వెళ్లే మార్గంలో పులులు సంచరిస్తుండడంతో ఆ ప్రాంతాన్ని సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ సందర్శించారు. అటవీశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో భయందోలనలపై అవగాహన కల్పించాలన్నారు.