TPT: ఏర్పేడు మండలం వికృతమాల కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల దేవాలయంలో మహా కుంభాభిషేకం మూడు రోజుల పాటు వైభవంగా జరుగుతోంది. దాతల సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తికాగా, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులు ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు పార్టీలకు అతీతంగా వేడుకలు నిర్వహించారు. వేద పండితుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు చేశారు.