AKP: రైతులు సమీకృత వ్యవసాయ విధానాన్ని పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీహరి, ప్రసాద్ సూచించారు. గురువారం రాంబిల్లి మండలం వెంకటాపురం కృషి విజ్ఞాన కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా పచ్చిరొట్ట ఎరువుల ఆవశ్యకత, చౌడు భూముల యాజమాన్యం పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీ ఉమా ప్రసాద్ పాల్గొన్నారు.