గుంటూరులో నిర్వహించిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే శంకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలకు తానున్నాననే భరోసా కల్పిస్తూ, ప్రతి సోషల్ మీడియా వారియర్కు అండగా ఉంటానన్నారు.