NGKL: ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ ఫలితాల్లో సందడి వివేకానంద రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఒక ప్రైవేట్ కళాశాల విద్యార్థి అయిన ఈయన 470 మార్కులకు గాను 462 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకు నిలిచారు. తన విజయానికి క్రమశిక్షణ, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారమే కారణమని వివేకానంద రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన్ను విద్యార్థులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు.