ఐపీఎల్ చరిత్రలో కళ్లు చెదిరే భారీ డీల్ కుదిరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా కన్సార్టియం $1.78 బిలియన్లకు(సుమారు రూ.16,732 కోట్లు) దక్కించుకుంది. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి 100% వాటాను కొనుగోలు చేసిన ఈ ఒప్పందంలో పురుషుల ఐపీఎల్ టీంతో పాటు మహిళల డబ్ల్యూపీఎల్(WPL) టీం కూడా ఉండటం విశేషం.