ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన కొనసాగుతుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా కాకముందే ఈ రూల్ ప్రవేశపెట్టారని తెలిపాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ రూల్ ఎక్కడికీ వెళ్లదని పేర్కొన్నాడు. అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో గంగూలీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.