విజయనగరం రింగ్ రోడ్లో నిర్మిస్తున్న YCP జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఉప శాసనసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం పరిశీలించారు. నిర్మాణ పురోగతిని సమీక్షించి, నాణ్యతతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు సూచించారు.