KMM: సత్తుపల్లి పట్టణం జూపల్లి రామచంద్రారావు కంటి, గుండె సంబంధించిన ఆసుపత్రిని ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి ప్రారంభించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యానికి ఎమ్మెల్యే సూచించారు. వారితోపాటు మున్సిపల్ వైస్ ఛైర్మన్ సుమలత, కౌన్సిలర్ రాంబాబు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నారావు పాల్గొన్నారు.