KMM: పెనుబల్లి మండలం తాళ్లపెంట సమీపంలో విద్యుత్తు తీగలతో అడవిపందిని వేటాడుతున్న ముగ్గురు వ్యక్తులను తల్లాడ రేంజ్ అటవీ అధికారులు ఇవాళ తెల్లవారుజామున అరెస్టు చేశారు. వారి నుంచి 60 KGల మాంసం రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ అధికారి ఉమ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారవ్వగా పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.